పశుసంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్

178697చూసినవారు
పశుసంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్
తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గొర్రెల స్కామ్ తరహాలో ఆవుల పంపిణీ స్కామ్ ను తాజాగా అధికారులు గుర్తించారు. దాదాపు రూ.3 కోట్ల స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. గొర్రెల స్కామ్ లో రూ.2.10 కోట్లు మోసం జరగగా.. ఇప్పటికే నలుగురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆవుల పంపిణీలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లోకి నిధులు జమా అయినట్లు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్