అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపుతున్నాయి. వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని.. కాల్పులు జరిగిన ప్రాంతానికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.