WHO పాండమిక్ అగ్రిమెంట్పై జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశాల్లో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచం ఎదుర్కొన్న పర్యవసానాలను గుర్తుచేశారు. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అది అనివార్యమని వెల్లడించారు.