కర్ణాటకలో మరో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రఫీక్, అతడి భార్య తనను బలవంతపు మతమార్పిడికి ప్రేరేపించారని ఓ 28 ఏళ్ల వివాహిత పోలీసులను ఆశ్రయించింది. తనపై వారిద్దరూ లైంగిక దాడి చేసి, ఫోటోలు తీసి, తనను మతం మారాలని బ్లాక్ మెయిలింగ్కు దిగారని పేర్కొంది. రఫీక్ తనను అతడి భార్య ముందే బలాత్కరించాడని ఆరోపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.