ఏపీ క్యాబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

61చూసినవారు
ఏపీ క్యాబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు అలాగే మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు, తిరుపతిలోని ESI ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను 100 పెంచడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. వీటితో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్