ఇసుక రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం

64చూసినవారు
ఇసుక రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం ఎడ్ల బండ్లలో మాత్రమే ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తరలించే అవకాశం ఉండగా తాజాగా.. ఈ అవకాశాన్ని ట్రాక్టర్లకు కూడా కల్పించింది. ఈ మేరకు ఇసుక పాల‌సీని స‌వ‌రిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేవలం స్థానిక అవసరాల నిమిత్తమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లొచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే గ్రామాల్లో అవసరాలకు సరిపడేంత మోతాదులో ఇసుక రవాణాకు అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్