క్షమాపణలు చెప్పిన ఆదిపురుష్ రచయిత

6164చూసినవారు
క్షమాపణలు చెప్పిన ఆదిపురుష్ రచయిత
దేశ ప్రజలకు 'ఆదిపురుష్' రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా క్షమాపణలు చెప్పారు. ‘ఆదిపురుష్‌’తో బాధపెట్టినందుకు క్షమించాలంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. "ఆదిపురుష్‌ వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరిస్తున్నాను. మా వల్ల ఇబ్బందిపడిన వారందరికీ చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నా. ఆ హనుమంతుడు మన్నందరినీ ఐక్యంగా ఉంచాలని, మన దేశానికి సేవ చేసేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నా' అని పోస్టు పెట్టారు.

సంబంధిత పోస్ట్