‘వచ్చే 15 ఏళ్లు భారత్‌లో సుస్థిర ప్రభుత్వం’

74చూసినవారు
‘వచ్చే 15 ఏళ్లు భారత్‌లో సుస్థిర ప్రభుత్వం’
భారతదేశంలో రాబోయే 15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. దీర్ఘకాలిక ప్రభుత్వంలోనే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై నిక్కీ ఫోరమ్‌లో జైశంకర్ మాట్లాడారు. భారతదేశం ఈ ఏడాది మేలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్తోందని, 95 కోట్ల మంది పౌరులు ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్