టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై మరో స్టార్ ఆల్రౌండర్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇవాళ భారత తొలి ఇన్నింగ్స్ 91వ ఓవర్లో సమన్వయ లోపం కారణంగా అశ్విన్ రనౌట్ అయ్యాడు. దీంతో సహనం కోల్పోయిన అశ్విన్ తన సహచర స్పిన్నర్ జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్విక్ సింగిల్ తీసే విషయంలో ముందుగానే కాల్ ఇస్తే రనౌటయ్యే వాడిని కాదు కదా? అని అశ్విన్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.