కజకిస్తాన్లో జరుగుతున్న ఆసియా అండర్-22 అండ్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు ఐదు స్వర్ణ పతకాలను సాధించారు. పురుషుల విభాగంలో బ్రిజేశ్(48 కేజీలు), ఆర్యన్ హుడా(51 కేజీలు), యశ్వర్ధన్ సింగ్(63.5 కేజీలు).. మహిళల విభాగంలో లక్ష్మి(50 కేజీలు), నిషా(52 కేజీలు) ఆసియా ఛాంపియన్స్గా నిలిచారు. మొత్తంగా యూత్ విభాగంలో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 8 కాంస్యాలతో మొత్తం 22 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.