ప్రముఖ రచయిత్రి విజయ భారతి కన్నుమూత

64చూసినవారు
ప్రముఖ రచయిత్రి విజయ భారతి కన్నుమూత
ప్రముఖ రచయిత్రి, బొజ్జ తారకం సతీమణి విజయ భారతి శనివారం కన్నుమూశారు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు సనత్‌నగర్‌లోని రెనోవా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో విజయ భారతి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె కవి, రచయిత బోయి భీమన్న కుమార్తె. ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అనేక సాహిత్య పురస్కారాలు అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్