నేపాల్‌లో వరదల బీభత్సం.. 39 మంది మృతి (వీడియో)

65చూసినవారు
పొరుగున ఉన్న నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఖాట్మండు లోయతో సహా ఎనిమిది జిల్లాల్లో మొత్తం 39 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది ఖాట్మండుకు చెందినవారు, 16 మంది లలిత్‌పూర్‌కు చెందినవారు, ఐదుగురు భక్తపూర్‌కు, ముగ్గురు కావ్రేపాలన్‌ చౌక్‌కు, పంచ్‌తార్, ధన్‌కూటా నుంచి ఇద్దరు చొప్పున, ఝాపా, ధాడింగ్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్