సత్యాగ్రహ దీక్ష ప్రారంభించిన ఆతిశీ

52చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలో 'ఆప్' మంత్రి ఆతిశీ శుక్రవారం మధ్యాహ్నం నిరవధిక 'సత్యాగ్రహ దీక్ష'ను ప్రారంభించారు. హర్యానా నుంచి ప్రతిరోజూ 100 మిలియన్ గ్యాలన్ల నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాంగ్‌పురలోని భోగల్ వద్ద నిరాహార దీక్షలో కూర్చుకుంటున్నానని, హర్యానా నుంచి రావాల్సిన జలాలు వచ్చేంత వరకూ దీక్ష విరమించేది లేదని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్