దారుణం.. నాలుగేళ్ల కుమారుడ్ని చంపి ఇంట్లోనే తగులబెట్టిన కసాయి తల్లి

8455చూసినవారు
దారుణం.. నాలుగేళ్ల కుమారుడ్ని చంపి ఇంట్లోనే తగులబెట్టిన కసాయి తల్లి
ఓ కసాయి తల్లి దారుణానికి ఒడిగట్టింది. తన నాలుగేళ్ల కుమారుడ్ని చంపి మృతదేహాన్ని ఇంట్లో తగులబెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ జిల్లాలో జరిగింది. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన ఆదేశ్ దేవి బుధవారం తన కొడుకు హర్షాను హత్య చేసింది. అనంతరం బాలుడి మృతదేహాన్ని ఇంట్లోనే తగులబెట్టింది. ఇది చూసి షాకైన ఆమె భర్త కపిల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పాక్షికంగా కాలిన బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను అరెస్ట్‌ చేశారు.

సంబంధిత పోస్ట్