TG: కొమురు భీం ఆసీఫాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. వన్యప్రాణుల నుంచి పొలానికి రక్షణగా సిర్పూర్ మండల పరిధిలోని టోంకినికి చెందిన రైతు చిరంజీవి విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. అనుకోకుండా పొలానికి వెళ్లిన చిరంజీవి కొడుకు జయేందర్ (19) ఫెన్సింగ్ తాకి మరణించాడు. నేరం తన మీదకు రాకూడని చిరంజీవి గుట్టుచప్పుడు కాకుండా కొడుకు మృతదేహాన్ని పెనుగంగలో పడేశాడు. కేసును ఛేదించిన పోలీసులు, డెడ్బాడీని గుర్తించారు.