ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో SBI మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్పై దాడి జరిగింది. బిలాస్పూర్లోని సదర్ బజార్ బ్రాంచ్ మేనేజర్ అంకిత్ భూషణ్ లాల్, అసిస్టెంట్ మేనేజర్ ప్రేమ్ కుమార్ జైస్వాల్ పై ముగ్గురు యువకులు దాడి చేశారు. బ్యాంకులో తీసుకున్న లోన్ వాయిదా మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేయడంతో కోపంతో ముగ్గురు యువకులు వారిని కొట్టారు. దాడి దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.