ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు

67చూసినవారు
ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు
హైదరాబాద్‌ నగరంలో ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అఫ్జల్‌గంజ్‌ నుంచి కుషాయిగూడకు వెళ్తున్న కుషాయిగూడ డిపోనకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఓయూ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమకు దారి ఇవ్వలేదనే కోపంతో దుండగులు బస్సును ఆపి డ్రైవర్‌పై దాడికి దిగారు. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్.. దాడికి పాల్పడిన ఆటో ట్రాలీ డ్రైవర్ జాన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి జగదీశ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్