గాజాలో దారుణ ఘటన జరిగింది. ఓ స్కూల్పై ఇజ్రాయిల్ వైమానిక దాడి(Israeli Strike) చేసింది. స్కూల్పై జరిగిన దాడిలో 35 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నుసేరత్ శరణార్థి క్యాంపులో ఉన్న స్కూల్ టాప్ ఫ్లోర్పై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు రెండు మిస్సైళ్లతో అటాక్ చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.