కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్లకు చెందిన హాస్టళ్లను ఆగంతకులు టార్గెట్ చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ, ఇస్లామాబాద్లోని ఎంబసీలు కిర్గిజిస్తాన్లోని తమ విద్యార్థులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. పాకిస్థానీలు, ఈజిప్టియన్లతో సహా స్థానికులు, విదేశీ విద్యార్థుల మధ్య హాస్టల్లో తలెత్తిన ఘర్షణ తర్వాత హింస చెలరేగిందని తెలుస్తోంది.