అంబానీ వేడుకలో చోరీకి యత్నం!

4005చూసినవారు
అంబానీ వేడుకలో చోరీకి యత్నం!
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ వేడుకల్లో చోరీ చేసేందుకు తమిళనాడుకు చెందిన ఓ ముఠా యత్నించింది. అయితే కట్టుదిట్టమైన భద్రత కారణంగా ఆ ఈవెంట్‌కు వెళ్లలేకపోవడంతో జామ్‌నగర్‌లోని కొన్ని కార్ల అద్దాలు బద్దలుగొట్టి దొంగతనాలు చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందటంతో సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగుర్ని అరెస్టు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్