ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. టీమిండియా ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్-A టాపర్గా నిలిచింది. గ్రూప్-Bలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది. ఈ మేరకు భారత్ సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మార్చి 4న భారత్-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.