AP: బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో 8 కీలక ఫైళ్లు మాయమయ్యాయి. కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్కు సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడంతో ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను వివరణ అడగగా.. వారు సరైన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. హెడ్ ఆఫీస్ నుంచి ఫైళ్లను తెప్పించి కోర్టులో కౌంటర్ వేయడానికి ఈవో చర్యలు తీసుకుంటున్నారు.