చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయ తలుపులు నేడు తెరుచుకోనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇప్పటికే చార్ధామ్ యాత్ర ప్రారంభం కాగా, రెండు రోజుల క్రితం కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. నవంబర్ వరకు ఈ తీర్థయాత్ర కొనసాగుతుంది. తొలిరోజు ఒక్క భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి రికార్డు స్థాయిలో కేదార్నాథ్ సందర్శించారు.