బాలాపూర్ లడ్డూను ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తా: కొలన్ శంకర్ రెడ్డి

81చూసినవారు
బాలాపూర్ లడ్డూను ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తా: కొలన్ శంకర్ రెడ్డి
బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ "మా కొలన్ కుటుంబం బాలాపూర్ లడ్డూని గణేశుని మీద ఉన్న భక్తితో రెగ్యులర్‌గా కొనేవాళ్ళం. ఈసారి నేను ఎందుకు కోన్నానంటే ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వడం కోసమే. మోదీకే ఎందుకు ఇవ్వాలనుకున్నానంటే ఆయన అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించారు. అప్పట్లో సాధారణ భక్తుల కోసం మేము ఇక్కడ అయోధ్య సెట్ కూడా వేశాం. అందుకే నేను బాలాపూర్ లడ్డూను ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తాను" అని అన్నారు.

సంబంధిత పోస్ట్