తమ డిమాండ్ల సాధన కోసం రేపు గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రహదారులపై రైతులు నిరసన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రేపు స్కూళ్లు, కాలేజీలు ఉంటాయా? లేదా? అనే సందేహం చాలామందిలో నెలకొంది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మాత్రమే బంద్ ఉంటాయి. పాఠశాలలు, కాలేజీలతో పాటు బ్యాంకులు తెరిచే ఉంటాయి.