తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో బర్రెలక్క ఇవాళ భేటీ అయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయినా.. మళ్లీ ఎంపీగా బరిలో ఉంటానని ఆమె ప్రకటించారు. ఈ నేఫథ్యంలో కోదండరాంతో భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది. అయితే టీఎస్పీఎస్సీ ద్వారా వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలకు
నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బర్రెలక్క కోదండరాంను కోరినట్లు తెలుస్తోంది.