అందమైన బీచ్లకు ప్రసిద్ధి చెందిన మాల్దీవులు తమ పౌరులపై నిషేధం విధించడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా స్పందించింది. మాల్దీవులకు బదులుగా భారత్లోని బీచ్లను సందర్శించాలని తమ దేశ పౌరులకు సోమవారం సూచించింది. ఇజ్రాయెల్ పర్యాటకులకు భారత్లో చక్కని ఆతిథ్యం లభిస్తుందని, కాబట్టి భారత్లోని గోవా, కేరళ, లక్షద్వీప్ వంటి అందమైన బీచ్లకు వెళ్లాలని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.