ధనియాల నీటిని ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి. ఆర్థరైటిస్, ఒళ్లు నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చి ఆరోగ్యంగా ఉంచడంలో ధనియాలు మేలు చేస్తాయి. కిడ్నీ, చర్మ, జట్టు సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. మలినాలను బయటకు పంపి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. నీటిలో ధనియాలను వేసి మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది.