కుక్క కాటు.. తండ్రీకొడుకు మృతి

56చూసినవారు
కుక్క కాటు.. తండ్రీకొడుకు మృతి
పెంపుడు కుక్క కరవడంతో తండ్రీకొడుకు మృతి చెందారు. ఈ ఘటన విశాఖ జిల్లా భీమిలీలో చోటు చేసుకుంది. నరసింగరావు (59), ఆయన కుమారుడు భార్గవ్ (27)ను వారం క్రితం పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్‌కు ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఈ ఘటన జరిగిన రెండ్రోజులకు కుక్క చనిపోయింది. దాంతో అప్రమత్తమైన తండ్రీకొడుకు యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్నారు. అయితే అప్పటికే మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకింది. చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు విడిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్