పెంపుడు కుక్క కరవడంతో తండ్రీకొడుకు మృతి చెందారు. ఈ ఘటన విశాఖ జిల్లా భీమిలీలో చోటు చేసుకుంది. నరసింగరావు (59), ఆయన కుమారుడు భార్గవ్ (27)ను వారం క్రితం పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్కు ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఈ ఘటన జరిగిన రెండ్రోజులకు కుక్క చనిపోయింది. దాంతో అప్రమత్తమైన తండ్రీకొడుకు యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్నారు. అయితే అప్పటికే మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకింది. చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు విడిచారు.