ప్రతిపక్ష హోదాపై స్పీకర్కు వైసీపీ అధినేత జగన్ లేఖ రాయడంపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. స్పీకర్ ఎన్నికకు హాజరవ్వని జగన్కు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ తన పేరును మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ జగన్ సభలో లేరని విమర్శించారు.