ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీలో 46డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. తెలంగాణాలో 45 డిగ్రీలకు పైగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సూర్యతాపానికి విలవిల్లాడిపోతున్నారు. దీంతో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అప్రమత్తంగా ప్రజలు ఉండాలని తెలిపారు.