ఘంటసాల పాటలతో తెలుగు సమాజం పరవశించిపోయిందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన వల్లే భగవద్గీత ప్రతి ఇంటికీ చేరిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఘంటసాల శత జయంతి వేడుకలను నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. హైదరాబాద్లోని మాదాపూర్ సీసీఆర్టీలో భారత్ కళా మండపం, దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి వెంకయ్య శంకుస్థాపన చేశారు.