ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలెర్ట్ జారీ చేసింది. ఎస్బీఐ రివార్డు పేరిట పంపుతున్న మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 'కొందరు నేరగాళ్లు రివార్డు పాయింట్స్ పేరిట వాట్సాప్, మెసేజ్ల రూపంలో ఏపీకేలు పంపుతున్నట్లు తెలిసింది. మేము ఎప్పుడూ ఇలాంటి మెసేజ్లు పంపము. ఏపీకేలు షేర్ చేయము. ఇలాంటి లింక్లపై క్లిక్ చేయకుండా, డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ భద్రత మా మొదటి ప్రాధాన్యత’ అని ట్వీట్ చేసింది.