మధ్యప్రదేశ్లోని సాగర్-రహ్లి రహదారిపై సోమవారం అర్ధరాత్రి ఊహించని ప్రమాదం జరిగింది. ఓ బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. ఆ సమయంలో కొన్ని ఆవులు రోడ్డుపై పడుకున్నాయి. ఈ క్రమంలో ఆవు దూడను బైకర్ ఢీకొట్టాడు. దీంతో బైకర్ కింద పడి సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఆవు దూడ కూడా ప్రాణాలు కోల్పోయింది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.