AIADMK ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు (Video)

71చూసినవారు
తమిళనాడులో అన్నాడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేలపై వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై ఇవాళ ఉదయం వేటు వేశారు. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను సభ నుంచి పంపించేయాలంటూ తమిళనాడు స్పీకర్ అప్పవు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు.

సంబంధిత పోస్ట్