మహిళపై దాడి చేసిన బీజేపీ కౌన్సిలర్(వీడియో)

63చూసినవారు
తన మాటకు ఎదురు చెప్పిందని ఓ మహిళపై బీజేపీ కౌన్సిలర్ దాడి చేసింది. ఈ ఘటన వారణాసిలో జరిగింది. దుర్గాఘాట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలనకు కౌన్సిలర్ కనక్ లతా మిశ్రా వెళ్లారు. అక్కడున్న ఓ ఇంటి గోడను తొలగించాలని కోరారు. దీనికి బాధితురాలు అర్చన సేథ్ నిరాకరించిది. ఈ క్రమంలో మాటమాట పెరిగి కౌన్సిలర్ మహిళపై దాడి చేసింది. బాధిత మహిళ తనని తాను రక్షించుకుంది. అనంతరం పిఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరాలవుతోంది.

సంబంధిత పోస్ట్