ఒడిశా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17 లోక్సభ, 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామన్నారు. జూన్ 4 తర్వాత నవీన్ పట్నాయక్ మాజీ సీఎం అవుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఒడిశాకు ఒడియా భాష, సంస్కృతీ సంప్రదాయాలు తెలిసిన వ్యక్తి సీఎంగా రాబోతున్నారంటూ వ్యాఖ్యానించారు.