కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రియా శ్రీనాథే మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఎన్కౌంటర్పై ఆమె స్పందిస్తూ.. చనిపోయిన మావోయిస్టులను షహీద్(అమరవీరులు) అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.