నోయిడాలో రూ.150 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

52చూసినవారు
నోయిడాలో రూ.150 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. నోయిడా సీపీ లక్ష్మీ సింగ్ నాయకత్వంలో పోలీసులు 26 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని వారు తెలిపారు. అలాగే ఈ డ్రగ్స్ కు సంబంధించిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్