మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కైసర్గంజ్ సిట్టింగ్ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు బీజేపీ షాకిచ్చింది. కైసర్గంజ్ లోక్సభ స్థానం నుంచి బ్రిజ్ భూషణ్ను గురువారం తొలగించి.. ఆ స్థానాన్ని ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్కు కేటాయించింది. ఈ విషయాన్నీ బీజేపీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.