జీవనోపాధి కోసం భారతీయులే విదేశాల బాట పడుతుంటే.. ఇతరుల కోసం పౌరసత్వ చట్టం తీసుకురావడం వల్ల ఉపయోగమేంటని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ రాజకీయ నాటకాలు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. గత పదేళ్లలో దేశంలో లక్షలమంది భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.