ఆదాయపన్ను శాఖకు బీజేపీ సుమారు రూ.4600 కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ అమౌంట్ను వసూలు చేసేందుకు బీజేపీకి ఐటీశాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. మేం పాల్పడిన ఉల్లంఘనలను సమీక్షించేందుకు ఎటువంటి అంచనాలు చేశారో, అలాగే బీజేపీ ఉల్లంఘనలను తాము కూడా స్టడీ చేసినట్లు ఆయన తెలిపారు. దాని ప్రకారమే బీజేపీ 4600 కోట్ల ఫైన్ కట్టాల్సి ఉంటుందన్నారు.