'డబ్బులు లేకనే ఐదు సార్లు ఓడిపోయా'

1067చూసినవారు
'డబ్బులు లేకనే ఐదు సార్లు ఓడిపోయా'
డబ్బులు లేకపోవడంతోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్న మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సమర్థించారు. ఆమె లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడంతో ఓడిపోయానని తెలిపారు.

సంబంధిత పోస్ట్