ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వరదల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం పెరిగిపోతోంది. దీనికి చెక్ పెట్టేందుకే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వారం ముందే వరదలను గుర్తించే ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్.ఫ్లడ్ హబ్ పేరుతో కొత్త ఏఐ టూల్ను తీసుకొచ్చొంది. వారం ముందుగానే వరదలు వచ్చే అవకాశాన్ని పసిగట్టడం ఈ టూల్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.