సముద్రంలో పడవ బోల్తా.. 60 మందికిపైగా జలసమాధి

61చూసినవారు
సముద్రంలో పడవ బోల్తా.. 60 మందికిపైగా జలసమాధి
లిబియా తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో మహిళలు, చిన్నారులు సహా 60 మందికి పైగా మరణించారు. ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. శనివారం మధ్యధరా సముద్రం గుండా వెళుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఐరోపాలో మెరుగైన జీవితాన్ని కోరుకునే వారికి మధ్యధరా సముద్రం ప్రమాదకరమైన మార్గం. ఇప్పటికే వందలాది మంది ఇలాంటి పడవల్లో ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్