దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఐజీఐ విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో, బురాయి, సంజయ్ గాంధీ ఆసుపత్రులకు 3 గంటల సమయంలో ఈ-మెయిల్స్ వచ్చాయి. ఐరోపా కేంద్రంగా పనిచేస్తున్న మెయిలింగ్ సర్వీస్ కంపెనీ ‘బీబిల్ డాట్కామ్’ నుంచి ఈ మెయిల్స్ వచ్చాయి.