తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. నేడు ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ, తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో 6 నియోజకవర్గాలు, తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినహా అన్ని చోట్లా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది.