ఎన్నికల పోలింగ్ రోజున మొదలైన ఘర్షణలు పల్నాడు జిల్లాను ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా బెల్లంకొండ నాగిరెడ్డిపాలెంలో ఏకంగా ఓ వాలంటీర్ ఇంట్లోనే ఈ బాంబులు కనిపించాయి. వెంటనే వాటిని సీజ్ చేసిన పోలీసులు.. వాలంటీర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వాలంటీర్ తండ్రి వైసీపీకి చెందిన నాయకుడు కావడం మరో విశేషం. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.