44 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌

85చూసినవారు
44 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఏపీ గిరిజన గురుకుల కాలేజీలో 44 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మాట వినడం లేదంటూ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థినులతో గుంజీలు తీయించారు. ఒక్కసారిగా 200 గుంజీలు తీయడంతో 44 మంది అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. మాట వినలేదని ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా అంటూ మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్