TG: మహబుబ్ నగర్ లోని పద్మావతి కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అభియాన్ హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. హోటల్ రెండో అంతస్తులో ఉన్న ఆరుగురు ఈ మంటల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. దీంతో వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.